- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. అంతేకాదు మృతదేహం అదే రైలు ఇంజన్ కు వేలాడుతూ..కొంత దూరం ప్రయాణించింది. ఈ హృదయ విదారక ఘటన బుదవారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ జీర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. మృతుడు ఘట్ కేసర్ ప్రాంతానికి చెందిన భిక్షపతి తనయుడు నర్సింగరావు (36) గా సీఐ సాయిశ్వర్ గౌడ్ గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.
- Advertisement -