నవతెలంగాణ – భిక్కనూర్
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని జంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగంపల్లి గ్రామానికి చెందిన అంజయ్య (42) చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. గురువారం తన భార్యను హాస్పిటల్లో చూపించి తర్వాత ఇంటికి వస్తానని చెప్పి రాత్రి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం జంగంపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించగా గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



