- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం నాడు మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో భాగంగా వాలీబాల్, కోకో ,కబడ్డీ, పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు, జోనల్ స్థాయి లకు పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పీడీలు హనుమాన్లు స్వామి, కృష్ణ పటేల్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పోటీల్లో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -