- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కోయ్యుర్ గ్రామంలో మెడికల్ షాపు(మందుల దుకాణం) శనివారం కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ ప్రారంభించారు. పేదలకు సరసమైన ధరలకే మందులు విక్రయించాలని, ప్రభుత్వ నిషేధిత మందులు అమ్మరాదని ఈ సందర్భంగా ఎస్ఐ షాపు నిర్వహకుడు జాగిలపు సంపత్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధి లింగమూర్తి, మాజీ ఉప సర్పంచ్ కొండూరి మమత పాల్గొన్నారు.
- Advertisement -