Monday, June 23, 2025
E-PAPER
Homeజిల్లాలునిజామాబాద్‌ లో టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 

నిజామాబాద్‌ లో టాస్క్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 

- Advertisement -

స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు
రిలేషన్‌షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు , నేటి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని నిజామాబాద్ నగరంలోని ఐటీ టవర్స్‌లో ఏర్పాటు చేయడం జరిగింది అని రిలేషన్‌షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి  ఓ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో జూన్ 25, 2025 (బుధవారం) ఉదయం 09:30 గంటలకు నిజామాబాద్ ఐటీ టవర్స్‌లోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళా ద్వారా డిప్లొమా, బి ఈ / బి టెక్ , డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ఈ జాబ్ మేళాలో పాల్గొననున్న కంపెనీలు డి ఎస్ టెక్నాలజీస్, బ్రియో టెక్నాలజీస్, స్కౌట్ బెటర్, ధరణి గియొ స్పటియాల్ టెక్నాలజీస్, డేవ్ లాట్స్, లు అని తెలియజేశారు. ఈ సందర్భంగా టాస్క్ సి ఈ ఓ  శ్రీకాంత్ సిన్హా మాట్లాడుతూ..ఈ జాబ్ మేళా ద్వారా యువతకు మంచి కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దడమే టాస్క్ ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
ప్రాంతీయ కేంద్రాల రాష్ట్ర అధికారి సవీన్ రెడ్డి నిజామాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని, తమ కెరీర్‌ ను ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు. రిలేషన్‌షిప్ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి ఎంపిక ప్రక్రియలో విజయవంతం కావాలంటే ఆత్మవిశ్వాసంతో పాల్గొనాలి అని సూచించారు.అభ్యర్థులు ఎక్కువ కాపీల రెజ్యూమేలు తీసుకురావాలి. కలెక్టరేట్ పక్కనగల టాస్క్ ప్రాంతీయ కార్యాలయం ఐటి టవర్స్ నిజామాబాద్ లో జాబ్ మేళా ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -