Friday, June 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలునాగలి పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..

నాగలి పట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ..

- Advertisement -

ఉత్పత్తులు దేశానికి ఎగుమతి చేసేలా రాష్ట్రం ఎదగాలి
బీడు భూములు లేకుండా సాగు చేయాలి
రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: ఈసారి మంచి వర్షాలుకురుస్తాయని  తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్పత్తులు ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా  మంత్రి పొన్నం ప్రభాకర్ ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతు సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న , ఆయిల్ ఫాం ఇతర ఏదైనా పంటలు వేయాలని కోరారు. రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీడు  లేకుండా చూడాలన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సహాయం, మద్దతు ధర అందిస్తుందన్నారు. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అన్ని రాజకీయ మిత్రులు అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా చూసుకోవాలన్నారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారికి మా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. హుస్నాబాద్ లో మూడు రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమం జరిగిందని ,ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు పద్ధతులపై మూడు రోజుల కాన్ఫరెన్స్ జరిగిందన్నారు. పంటలు ,యాంత్రీకరణ తదితర అంశాలపై రైతులు అవగాహన చేసుకున్నాట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కేట్ వైస్ చైర్మన్ బంక చందు, మడప జైపాల్ రెడ్డి , వెన్నె రాజు, పోలు సంపత్, వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి ఏ శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -