- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి సీతక్క నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కొవిడ్ను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ 2021లో ఇందిరా పార్క్ వద్ద సీతక్క దీక్ష చేపట్టారు. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సీతక్కతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమె గురువారం ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 13కి వాయిదా వేసింది.
- Advertisement -