- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని నారాయణపేట నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ లను నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా ముత్యం రెడ్డి ఎన్నిక కావడంతో , మంగళవారం నారాయణపేట సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఎమ్మెల్యేలు కలవడంతో ఎమ్మెల్యే వారిని సన్మానిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
- Advertisement -



