- Advertisement -
నవతెలంగాణ బాల్కొండ
మండల పరిధిలోని బోదేపల్లి గ్రామంలో శుక్రవారం కత్తుల మల్లయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



