Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్:  అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిల్పా కళావేదికలో నిర్వహించిన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ జీవిత చరిత్ర “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. దత్తాత్రేయ సామాన్య ప్రజల నుంచి దేశ నాయకులందరికీ సుపరిచితుడని, ఏడాదికి ఓ సారి పార్టీలకతీతంగా అందరిని ఒకతాటి పైకి తెచ్చి అలై బలై అనే కార్యక్రమాన్ని నిర్వహించే గొప్ప నాయకుడు అని అన్నారు. దత్తాత్రేయ పదవులకు సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతాడని, పార్టీలకతీతంగా ఇష్టపడే వ్యక్తి దత్తాత్రేయ అని, రాబోయే కాలంలో మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని ఎమ్మెల్యే అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -