- Advertisement -
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు హెచ్ హెచ్ షేక్ సబహ్ అల్- ఖలెద్ అల్- హమద్ అల్- ముబారక్ అల్- సబహ్ తో టెలిఫోన్లో మాట్లాడారు. గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా దేశాలలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రత గురించి వారితో చర్చించారు. కాగా దేశం వద్ద ఇరవై ఐదు రోజులకు సరిపడా ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్రం తెలిపింది.
- Advertisement -



