- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఝార్గ్రామ్లో జరిగిన ఒక భూ కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ను పశ్చిమ బెంగాల్ సీఐడీ గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో రాయ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. అభిషేక్ బెనర్జీ తరఫున రాయ్ డబ్బు వసూలు చేయడంలో పాలుపంచుకున్నాడని అభియోగాలు నమోదు చేయబడ్డాయి. పీఏ అరెస్ట్ నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ నివాసం వెలుపల పోలీసులు భారీగా మోహరించారు.
- Advertisement -



