నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని లొంగన్ గ్రామాన్ని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం నాడు సందర్శించారు మరియు గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన లబ్ధిదారులు ప్రతి ఒక్కరు ఇండ్లను నిబంధనలకు లోబడి నిర్మించుకోవాలని, నిర్మించుకున్న వాటికి వేని వెంటనే బిల్లులు చెల్లించబడు తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఉండడానికి ఇంటి నిర్మాణాలు చేసుకోవాలని ఎంపీడీవో గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధ, ఇందిరమ్మ పథకంలో మంజూరైన లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES