- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రంలో పతాంజలి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండల అభివృద్ధి అధికారి రాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. యోగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. యోగ చేసిన వారికి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పతాంజలి ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు ఏపీవో పద్మ బిజెపి నాయకులు తుకారం కృష్ణ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -