- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదామని ఎంపీడీఓ రాణి అన్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో గ్రామ కార్యదర్శులతో కలిసి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓకు మండలంలోని గ్రామ కార్యదర్శులంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ అధికారులు, సిబ్బంది, మండలంలోని గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -