ఇన్వెస్ట్ మెంట్ పేరిట యువకుడిని మోసం చేసిన వైనం
నిందితుడిపై 38 కేసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఇన్వెస్టిమెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి యువకుడిని మోసం చేసిన ముంబాయి మోసగాడిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైం డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి ముంబాయిలోని ఈస్ట్ బోరువల్లి కాజుపాడ ప్రాంతానికి చెందిన పాండురంగ్ సుభాష్ మహాపంకర్ ఆలియాస్ సాగర్ అనే వ్యక్తి ఇన్వెస్ట్ మెంటో పేరిట మోసానికి పాల్పడ్డారు. రూ.31 లక్షల 36 వేల 900 తన ఖాతాలోకి వేయించుకుని మొహం చాటేశాడు. డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్న సాగర్ పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్ రావు తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ సీఐ ముఖీద్ పాషా, సురేష్, నాగభూషణం, ప్రవీణ్, నరేష్ లు ముంబాయికి వెళ్లి ఐదు రోజులు గాలించి పాండురంగ్ సుభాష్ మహాపంకర్ ఆలియాస్ సాగర్ ను పట్టుకున్నారు. అతడిపై మహారాష్ట్రలో 38 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. అతన్ని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
ముంబాయి మోసగాడు అరెస్ట్ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES