నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసాకొత్తూర్ గ్రామానికి చెందిన ఉట్నూర్ నరేష్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం నరేష్ కు సంస్థ ప్రతినిధులు నియామక పత్రాన్ని అందజేశారు.ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన ఉట్నూర్ నరేష్ రాష్ట్ర వ్యాప్తంగా సమాజన్నీ పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై వివిధ అవగాహన సదస్సులు నిర్వహించారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం, విద్యార్థులకు క్యారియర్ గైడెన్స్ వంటి వివిధ అంశాలపై అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరపున మన్ననలు పొందారు.రానున్న రోజుల్లో సమాజానికి ఉపయోగపడే విధంగా మరిన్ని సదస్సులు నిర్వహించి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.కార్యక్రమంలో రామచంద్రుడు, వజ్జ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.



