- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు గాను రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్ అనే వ్యక్తిని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రూ.4లక్షలు తీసుకుంటుండగా సదరు అధికారిణిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
- Advertisement -