Sunday, November 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీఐటీయూ మహాసభలకు..'నవతెలంగాణ' మెదక్‌ జిల్లా విరాళం

సీఐటీయూ మహాసభలకు..’నవతెలంగాణ’ మెదక్‌ జిల్లా విరాళం

- Advertisement -

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
డిసెంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు మెదక్‌ పట్టణంలో నిర్వహించనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలకు మెదక్‌ జిల్లా నవతెలంగాణ విలేకరులు తమ వంతు విరాళంగా సుమారు రూ.14,000 అందజేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నవతెలంగాణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశంకు విలేకరులు అందించిన ఆర్థిక సహాయాన్ని రీజినల్‌ మేనేజర్‌ రేవంత్‌ కుమార్‌, ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ప్రతినిధి దండు ప్రభు, డెస్క్‌ ఇన్‌చార్జి దస్తగిరి అందజేశారు. ఈ సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ.. సీఐటీయూ కార్మికులు, ప్రజల పక్షాన పనిచేస్తుందన్నారు. నవతెలంగాణ విలేకరులు ప్రజాపోరాటాలకు అండగా నిలవడం హర్షణీయమన్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహాసభల జయప్రదానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్‌ ఏడీవీటీ ఇన్‌చార్జి మల్లేశం, నర్సాపూర్‌ ఏడీవీటీ ఇన్‌చార్జి మహిపాల్‌, రికవరీ ఇన్‌చార్జి నారాయణ, విలేకరులు జె. శ్రీనివాస్‌, బి.మల్లేశం, సాయికృష్ణ, సత్యనారాయణ, చిన్న సాయిలు, ఆర్‌.శ్రీనివాస్‌, చెంద్రయ్య, డి.మురళీ, సలీం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -