- Advertisement -
ఆర్టిఐ క్యాలెండర్ ఆవిష్కరణలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
నవతెలంగాణ – కాటారం
ప్రభుత్వ అధికారులు జవాబుదారీతనంగా ఉండాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్నారు. శనివారం యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ 2026 నూతన క్యాలెండర్ ను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి,పాలనలో పారదర్శకత స,హ చట్టంతోనే సాధ్యమన్నారు. సహచట్టం సామాన్యుడికి ఒక వజ్రాయుదం లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్,మండల కమిటీ సభ్యుడు బూడిద రాజ సమ్మయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -


