Thursday, September 25, 2025
E-PAPER
Homeసినిమా'గోదారి గట్టుపైన'

‘గోదారి గట్టుపైన’

- Advertisement -

‘మేమ్‌ ఫేమస్‌’ తరువాత హీరో సుమంత్‌ ప్రభాస్‌ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌కు ఫస్ట్‌ వెంచర్‌. ఎంఆర్‌ ప్రొడక్షన్స్‌ షార్ట్‌ ఫిల్మ్‌లతో పాపులరైన సుభాష్‌ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిధి ప్రదీప్‌ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. గురువారం మేకర్స్‌ ఈ చిత్ర ఫస్ట్‌ బ్రీజ్‌ని రిలీజ్‌ చేశారు. ‘లైట్‌ హౌస్‌పైకి తన ప్రేమికురాలిని తీసుకెళ్లిన హీరో.. గోదావరి సముద్రంలో కలిసిపోయే అద్భుత దృశ్యం చూపించే సన్నివేశంతో వీడియో ప్రారంభమవుతుంది. ‘ఇదే సంగమం.. ఇక్కడే గోదారి సముద్రంలో కలుస్తుంది.

ప్రకృతి ఎంత విచిత్రమైందో కదా. మంచినీరు, ఉప్పునీరు వేరువేరు తత్వాలు అయినప్పటికీ రెండు ఒకటిగా కలిసిపోతున్నాయి. మనుషులు కూడా ఇలా బేధాభిప్రాయాలు లేకుండా ఒకటిగా కలిసిపోతే ఈ మత భేదాలు అనేవి ఉండవు కదా’ అని సుమంత్‌ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ అందరినీ అలరిస్తోంది. గ్లింప్స్‌ చాలా ఫ్రెష్‌ అండ్‌ సోల్‌ఫుల్‌గా ఉంది. రచన, దర్శకత్వంతో సుబాష్‌ చంద్ర ఆకట్టుకున్నారు. సుమంత్‌ ప్రభాస్‌ తన పాత్రలో ఇమిడిపోయారు, నిధి ప్రజెన్స్‌ కట్టిపడేసింది. జగపతి బాబు పాత్రకి ఇచ్చిన పరిచయం ఆసక్తి కలిగించేలా ఉంది.హృదయాన్ని హత్తుకునే కథా నేపథ్యం, సహజమైన నటన, క్రియేటివ్‌ టచ్‌తో ఈ సినిమా ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతి అందించబోతోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -