- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
డోంగ్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని వివిధ శాఖల అధికారులు, మతాల పెద్దలు, మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,యువకులు గ్రామస్తులు హాజరుకావాలని కోరారు. కుల మతాలకు అతీతంగా గ్రామాలలో నిర్వహించే వినాయక చవితి పండుగ, ఇతర పండుగలు శాంతియుతంగా జరుపుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తహశీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -