నవతెలంగాణ – మల్హర్ రావు
నాశముక్త భారత్ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా కాటారం మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో సోమవారం ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించబడింది. (సామూహికంగా మొక్కలు నాటే కార్యక్రమం). ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి మల్లేశ్వరి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించడమే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి, నాశముక్త భారత్ లక్ష్యాలపై విలువైన సందేశాన్ని అందించారు.మత్తుకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు మత్తుపదార్థాల దుష్పరిణామాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ సిడిపిఓ శ్రీమతి రాధిక, కేజీబీవీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్బా పాఠశాలలో ప్లాంటేషన్ డ్రైవ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES