- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో భారత ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడారు. పాకిస్థాన్ దాడి చేస్తే.. ప్రతిచర్య గట్టిగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో కఠినంగా ఉంటామని వివరించారు. తమ సంయమనం బలహీనత కాదని తేల్చి చెప్పారు. కాగా ప్రధాని త్రివిధ దళాలతో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని చెప్పారు.
- Advertisement -