- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లాలోని ఓల్డ్ కలెక్టరేట్ పరిధిలో ఆనవాయితీగా వస్తున్నటువంటి టీజీవో బోనాలకు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. ఆనవాయితీగా వస్తున్నటువంటి బోనాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు అనేవి మన తెలంగాణ సాంస్కృతికి , సాంప్రదాయానికి నిదర్శనం అని, మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యము ఎంతో పవిత్రతతో కలిగినదని, అమ్మవారు మన ప్రజలందరినీ ఆశీర్వదించాలని అందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.
- Advertisement -