Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును సందర్శించిన పోలీస్ కమిషనర్

ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును సందర్శించిన పోలీస్ కమిషనర్

- Advertisement -

ప్రాజెక్టుపై సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పోచంపాడు గ్రామం లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ సందర్శించారు. అందులో భాగంగా ప్రాజెక్టులపై సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నదున గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. కావున ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు మరియు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది.

అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.ఎస్ ఆర్ ఎస్ పి ప్రాజెక్ట్ పర్యటకుల సందడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని మరియు వాహనాల పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్మూర్ ఏసిపి వై. వెంకటేశ్వర రెడ్డి , ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి , మెండోరా ఎస్సై జె. సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad