Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రమోషన్ పొందిన ఎస్ఐలను అభినందించిన పోలీసు కమిషనర్

ప్రమోషన్ పొందిన ఎస్ఐలను అభినందించిన పోలీసు కమిషనర్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ రాష్ట్ర డిజిపి ఆదేశానుసారముగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏఎస్ఐ నుండి ఎస్సై లు గా ఇద్దరూ ప్రమోషన్ పొంది శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ని కలవడం జరిగింది. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఏఎస్ఐ లకు ఎస్సై లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి ఎస్.ఐ.లకు పోలీస్ కమిషనర్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు.  కె. గంగాధర్: ఏ.ఎస్.ఐ, మాక్లూర్ పి.ఎస్, నుండి -జగిత్యాల కు, కే.రమేష్, ఏ.ఎస్.ఐ- నిజామాబాద్ టౌన్ 5 వ పోలీస్ స్టేషన్ నుండి నిర్మల్ కు, పదోన్నతి పొందినవారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -