- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని కుదాభక్షపల్లి గ్రామంలో ఈ నెల 6 న జరిగిన రోడ్డు ప్రమాదంలో లోయపల్లి గ్రామానికి చెందిన సిలువేరు అనిల్ కు తీవ్ర గాయాలై గత మూడు రోజులుగా హైదరాబాదులోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.ప్రమాదానికి కారణమైన స్విఫ్ట్ కారు వాహనం డ్రైవర్ ఇస్కిల్ల కిరణ్ పై మృతుని అన్న సిలువేరు రాజు గురువారం మర్రిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.
- Advertisement -



