– బోరిగాం వెళ్లకుండా మూడంచెల భద్రత ఏర్పాటు
నవతెలంగాణ -ముధోల్ : ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో ప్రభుత్వ స్థలంలో తొలగించిన బుద్ధ విగ్రహాన్ని పున ప్రతిష్టించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం దళిత సంఘాల నాయకులు చలో బోరిగాం కు పిలుపునిచ్చారు. దీంతో చలో బోరిగాం కార్యక్రమం పై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్ ,ఆడ్మీన్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రేడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.నిర్మల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, బారీ సంఖ్యలో తరలివస్తారని సమాచారం మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుండే పోలిసుల హడావుడి మొదలైంది. బోరిగాం గ్రామంకు వేళ్ళే రోడ్డులో పై పోలిస్ పికెటింగ్ లు ,బారీ గేట్లు లు ఏర్పాటు చేశారు.క్షుణంగా తనిఖీ చేసిన తర్వాత అటు వైపు వెళ్లేవారిని వదిలిపెడుతున్నారు. నిర్మల్ జిల్లా నుండి భద్రత కోసం సుమారు 150 మంది పోలీసులు వచ్చారు. ఇందులో సిఐ లు , ఎస్ఐ లు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీస్ లు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.చలో బోరిగాం అడ్డుకునేందుకు పోలీసులు మూడుఅంచేల భద్రతను ఏర్పాటు చేశారు. చలో బోరిగాం ఉత్కంఠ శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగునుంది. పోలీసులు మాత్రం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
చలో బోరిగంపై పోలీస్ నిఘా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES