- Advertisement -
వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్
సామినేని కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-చింతకాని
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం హత్యకు గురైన రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాల సీనియర్ నాయకుడు సామినేని రామారావు కుటుంబ సభ్యులను శనివారం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సంఘ రాష్ట్ర నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీనుతో కలసి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలియజేశారు. రామారావు హత్య గ్రామీణ పేదల పోరాటాలపై జరిగిన దారుణ రాజకీయ దాడి అని అన్నారు. ఆయన త్యాగాలు, ప్రజా ఉద్యమాలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- Advertisement -



