Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

సీఎం, మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉద్యోగులకు ఈ శాఖ పరిధిలో పనిచేసే దీపా ధూప నైవేద్య అర్చకులకు కల్పించిన బెనిఫిట్స్ జీవితాంతం మరువలేమని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ అధికారి కులకర్ణ వేణు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దేవాదాయ శాఖ ఉద్యోగులకు బెనిఫిట్స్ అమలుపరుస్తూ జీవో జారీ చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజన అప్ప మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అర్చక సంఘం సంక్షేమం సీఎ రేవంత్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి ఫలితమే అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు స్వామి అంజనప్ప మండల అధ్యక్షులు వెంకట్ మహారాజ్ ధూపా దీప నైవేద్య అర్చకులు రాందేవ్ తివారి అక్షయ్ మహారాజ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -