- Advertisement -
ఉలిక్కిపడ్డ మావోయిస్టులు, ప్రజలు
నవతెలంగాణ – మల్హర్ రావు/పలిమేల
సోమవారం నుంచి మావోయిస్టుల వారోత్సవాలు నేపథ్యంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజా ఫ్రంట్ పేరుతో పలిమల మండలం ముకునూరు, నీలంపల్లి, బూరుగూడెం, సర్వాయిపేట గ్రామాల్లో వాల్ పోస్టర్లు వెలిశాయి. దీంతో ఒక్కసారిగా మావోయిస్టులు, ప్రజలు ఉలిక్కిపడ్డారు. మావోయిస్టు అగ్రనేతలు కాలంచెల్లిన సిద్ధాంతాలు వీడి, జనజీవన విధానంలో కలవాలంటూ పోస్టర్లు వెలిచాయి. తమ మేధస్సును ప్రజల అభివృద్దికి ఉపయోగించాలంటూ వెలసిన మావోయిస్టు ఆత్మరక్షణ-ప్రజాఫ్రంట్ పోస్టర్లు కలకలం రేపాయి.
- Advertisement -