Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుగుంతలమయమైన రోడ్లు .. పట్టించుకోని అధికారులు

గుంతలమయమైన రోడ్లు .. పట్టించుకోని అధికారులు

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ : రెంజల్ మండలం నీలా, పేపర్ మిల్ గ్రామాల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రోడ్డు గుంతల మయమై వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ప్రతి రోజు వందలాది వాహనాలు ఈ రోడ్డుపై వెళ్తున్నందున పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా రోడ్డు పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. ద్విచక్ర వాహనదారులు మాత్రం అదమర్చి నడిపిస్తే ప్రమాదాలు గురికావాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ రోడ్డుపై పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ రోడ్డు భవనాల శాఖ అధికారులు మాత్రం స్పందించడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. సాటాపూర్ నుంచి కందకుర్తి వరకు రోడ్డు పరిస్థితి గుంతల మయమై ప్రమాదాలకు నిలయంగా మారాయి. అధికారులు వెంటనే స్పందించి ప్యాచ్ వర్క్ చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానిక మండల ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad