- Advertisement -
ఐఎన్ఎస్ వాఘ్షీర్లో ప్రయాణం
కార్వార్: రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్నాటకలోని కార్వార్ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్ లో ఆమె బయలుదేరారు. రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠి ఉన్నారు. కల్వరి క్లాస్ జలాంతర్గామిలో రాష్ట్రపతి ముర్ము ప్రయాణించడం ఇదే తొలిసారి. గతంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కల్వరి శ్రేణి సబ్మెరైన్లో ప్రయాణించారు.
- Advertisement -



