- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోంది. ఈ రాష్ట్రం శక్తిమంతమైన పర్యావరణ వ్యవస్థ కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.
- Advertisement -