- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
చలికాలంలో ఎలర్జీలు ఎక్కువగా అవుతాయని, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని పట్టణంలోని స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ కంటి వైద్య నిపుణురాలు స్నేహ సోమవారం తెలిపారు. కొందరికి ఈ సీజన్ లో ఎక్కువగా వస్తాయని ,కళ్ళు ఎరుపుగా మారుతాయి అని, ఇది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని, అశ్రద్ధ చేయకుండా కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. వృద్ధులు సైతం చలికాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, 50 సంవత్సరాలు దాటిన తర్వాత మోతె బిందు పరీక్షలు చేసుకోవాలని, కళ్ళను నలిచినప్పుడు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
- Advertisement -



