- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, రమాదేవి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు రోడ్డుపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్ర పూరిత కక్షలకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారింది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసేందుకు ప్రయతించగా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జి గంగాధర్, కె.అంజయ్య, చిన్నన్న, శంకర్, శ్యామ్ లాలుమియ్య, శ్యాం, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



