- Advertisement -
నవతెలంగాణ – రాజపేట
రాజపేట మండలంలోని కుర్రారం గ్రామానికి చెందిన మాచర్ల వెంకటేష్ ఇటీవల ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరణించడం జరిగింది. వారి కుటుంబానికి సోమవారం బీఆర్ఎస్ నాయకులు బొడ్డు భాస్కర్ రూ.5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రేకులపల్లి మల్లారెడ్డి, జూకంటి బాలస్వామి, పాండవుల బసవయ్య, ఎర్రగుంట సంజీవ, ఎర్రగుంట భాస్కర్, మాచర్ల బాలరాజు, ఏలూరి ప్రభాకర్, గంపల యాదగిరి, ఎర్రగుంట క్రాంతి కుమార్, ఏలూరి సునీల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



