Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి..

పాఠశాలల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి..

- Advertisement -

ప్రారంభమైన బడిబాట..
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రజాప్రతినిధుల, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని మండల విద్యాశాఖ అధికారి లక్ష్మన్ బాబు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య,ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకారుప దుస్తులు, మధ్యాహ్న భోజనం లభిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, బయట తిరిగే బడిడు పిల్లలను బడుల్లో చేర్పించడమే ద్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్నీ మండలంలో తాడిచెర్ల  హైస్కూల్, ఎడ్లపల్లిలోని మోడల్ స్కూల్లో తోపాటు ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాలు ఉపాధ్యాయులు చేపట్టారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాన కల్పిస్తూ పుర విధుల్లో ర్యాలీలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పాఠశాల ప్రాదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎమ్మార్ ఉపాధ్యాయులు,అంగన్ టీచర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -