- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున, ఈ నెల 16వ తేదీ (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంత రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
- Advertisement -



