Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాసేవే అంతిమ లక్ష్యం.. ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజాసేవే అంతిమ లక్ష్యం.. ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

– ఎర్రబెల్లి ఆధ్వర్యంలో పార్టీలో పలువురు చేరిక
నవతెలంగాణ – రాయపర్తి : ప్రజా సేవే అంతిమ లక్ష్యం అని ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని ఏకే తండా, సూర్య తండాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందచేశారు. తదుపరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పలువురు పార్టీలో చేరారు. అనంతరం జగన్నధపల్లి, ఉకల్ గ్రామాల్లో యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  యువత సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలని తెలిపారు. క్రీడలతో క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని సూచించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడకుండానని తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధిని గుర్తించారని హితబోధ చేశారు. రాయపర్తి మండల వ్యాప్తంగా ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మునవత్ నర్సింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతకుల రంగా రెడ్డి, మండల పార్టీ  నాయకులు గారె నర్సయ్య, బద్దం వేణుగోపాల్ రెడ్డి, లేతకుల మధుకర్ రెడ్డి, ఐత రాంచందర్, భాషబోయిన సుధాకర్, కుందూరు యాదగిరి రెడ్డి, పెరటి యాదవ రెడ్డి, గజావెల్లి ప్రసాద్, ఎండీ యూసఫ్, గబ్బేట యాకయ్య, ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్స్ ఉబ్బని సింహాద్రి, సంకినేని ఎల్లస్వామి, యూత్ చందు రామ్, చందు సతీష్, చిలువేరు సాయి గౌడ్, పెద్దగోని జీవన్,  ఐత రవి, చందు లక్ష్మన్, ఉబ్బని మధు,  ఐత జంపి, పిరని రాజు, గారె నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -