Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వాన్ని చాటుకున్న పుడమి ఫౌండేషన్..

మానవత్వాన్ని చాటుకున్న పుడమి ఫౌండేషన్..

- Advertisement -

నవతెలంగాణ – మక్తల్: మక్తల్ మండలం కచ్వార్ గ్రామం టోల్ గేట్ దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తి చాలా రోజుల నుండి అక్కడే ఉంటూ కనిపించడం జరిగింది. ఆ వ్యక్తి జుట్టు పెరిగిపోవడంతో పాటు సరైన బట్టలు లేకపోవడం, అశుభ్రంగా ఉండడం చూసి పుడమి ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటపతి రాజు ఆధ్వర్యంలో ఆ వ్యక్తిని శుభ్రపరచి కొత్త బట్టలు తొలగించడం జరిగింది. ఈ వ్యక్తిని హైదరాబాదులోని ఆశ్రమాలలో చేర్పిద్దామని ప్రయత్నం చేసినప్పటికీ వారిని సంప్రదించగా ఆశ్రమాలన్నీ ఎక్కువ సంఖ్యలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసింది.కావున ఆశ్రమాలలో చేర్పించలేకపోయాం.పుడమి ఫౌండేషన్ మా శక్తి మేరకు మానవ సేవలో ఉంటామని తెలియజేస్తున్నాము. ఇలాంటి వారి పట్ల ఉదార భావంతో వ్యవహరించి సహాయపడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.ఈ కార్యక్రమంలో పుడమి ఫౌండేషన్ చెర్మన్ జె వెంకటపతి రాజు, వెంకటేష్ బాబు, కె.సురేష్, కె.లక్ష్మణ్, జె.నాగరాజు, జె.రమేష్ , జె.తరుణ్  కె. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -