Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం కొనుగోలు

ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం కొనుగోలు

- Advertisement -

అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్
నవతెలంగాణ – వనపర్తి  

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్.ఏ.క్యూ ) నిబంధనల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. పానుగల్ మండల పరిధిలోని ఐకెపి వరి కొనుగోలు కేంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్ ను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఖీమ్యా నాయక్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎఫ్.ఏ.క్యూ (FAQ) నిబంధనల ప్రకారం మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని రిజిస్టర్లను సరిగా నిర్వహించాలని, కొనుగోలులో ముందుగా వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే, ట్యాగ్ చేయబడిన మిల్లుకు తరలించాలని ఆదేశించారు.

ఆ తర్వాత, కొత్తపేట గోడౌన్‌కు వెళ్లి, సీఎంఆర్ (CMR) కింద మిల్లుల నుంచి డెలివరీ అయిన బియ్యం నిల్వలను పరిశీలించారు. నాణ్యత, నిల్వ విధానాలపై అధికారులకు సూచనలు చేశారు. అంతకుముందు, పానుగల్లు మార్కెట్ కమిటీ (AMC) గోడౌన్‌ను సందర్శించి, కొత్తగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీ స్థలం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ తో పాటు, పానుగల్ తహసీల్దార్, జిల్లా పౌర సరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డి ఎం జగన్ మోహన్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -