బడిబాట ఇంటింట ప్రచారంలో ఉపాధ్యాయులు
నవతెలంగాణ – మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరే విధంగా ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన చేపడుతుంది. ఈ బడిబాట కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండలంలోని చిన్న తడగూర్ గ్రామపంచాయతీ పరిధిలో చిన్నతడుగూర్, ఖరగ్, ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు అడ్మిషన్ల కోసం ఇంటింటా ప్రచారాన్ని పాఠశాల ఉపాధ్యాయులు సాయికుమార్ అంగన్వాడీ టీచర్ యశోద చేపడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉంటాయని, నాణ్యమైన విద్య బోధన ఉంటుందని అన్నారు. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని బడిబాట కార్యక్రమంలో ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వపరంగా పిల్లలకు అందించే సౌకర్యాల గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్ చిన్నారి పిల్లలు గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES