Friday, June 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య..

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య..

- Advertisement -

నవతెలంగాణ – హలియా
మండల విద్యాధికారి గుండా కృష్ణమూర్తి: ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య దొరుకుతుందని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మండల విద్యాధికారి గుండా కృష్ణమూర్తి అన్నారు. టీఎస్ యుటి ఎఫ్ నల్లగొండ జిల్లా శాఖ చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రచార జాతను ఆయన అనుమల హాలియాలో ప్రారంభించారు. అనంతరం యుటిఎఫ్  జిల్లా కోశాధికారి రాజు మాట్లాడుతూ.. ప్రయివేట్ పాఠశాలల ఊబిలో పడి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య దొరుకుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమాదేవి,  మండల బాధ్యులు అధ్యక్షులు చింతపల్లి రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎస్కే సయ్యద్మియా, సీనియర్ కార్యకర్తలు వెంకట్రామిరెడ్డి, మద్దెల ప్రసాద్, ఓరువాల సరిత, మహిళా సమాఖ్య ఏపిఎం కళావతి, కృష్ణ,మన్నెం వెంకటేశ్వర్లు, జానీ మియా, నరేష్ చారి, కట్టా మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -