నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని వెల్మగూడెం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్నెం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీపీ ఎస్ వెల్మగూడెంలో బడిబాట గ్రామసభ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. అన్ని అర్హతలు కల ఉపాద్యాయులు ప్రభుత్వ బడుల్లో పని చేస్తున్నారని చెప్పారు. మెరుగైన, నాణ్యమైన విద్య ప్రభుత్వ బడుల్లో అభిస్తుందని తెలిపారు. సన్న బియ్యంతో భోజనం లభించడంతోపాటు ఆట పాటల ద్వారా, డిజిటల్ భోధన కొనసాగుతుందని చెప్పారు. అత్యున్నత ఫలితాలు సాధించే సర్కారు బడులను ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షులు భాషి పాక లక్ష్మీ సురేందర్, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావేత్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES