Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఉరేసుకొని రైల్వే గేట్ కీపర్ ఆత్మహత్య 

ఉరేసుకొని రైల్వే గేట్ కీపర్ ఆత్మహత్య 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రైల్వే గేట్ కీపర్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్ సమీపంలో చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్ మాస్టర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్ కీపర్ గా పనిచేస్తున్న విజయేంద్ర కుమార్ భైరవ అనే వ్యక్తి సోమవారం ఉదయం రైల్వే గేట్ సమీపంలోని స్టోర్ కీపర్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసులో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవలే విజయేంద్ర కుమార్ కు నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం నాలుగు గంటల వరకు విధులు నిర్వర్తించి అనంతరం ఉరేసుకొని చనిపోయినట్లు తెలిసింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటున్నారు. నిశ్చితార్థం జరిగినా.. పెళ్లి ఇష్టం లేకనే ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -