- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకురాలు సుమతి, స్వాతి తోటి అధ్యాపకులకు రాఖీలు కట్టారు. కళాశాల విద్యార్థినీలు, విద్యార్థులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులకు రక్షాబంధన్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు సీట్లను పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వెంకటేష్, గంగాధర్, శ్రీహరి, మురళి, గంగారం, మహేందర్, రాజ్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -