- Advertisement -
నవతెలంగాణ – జన్నారం : జన్నారం ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామ్మోహన్ సోమవారం ఎఫ్డిఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తాళ్ల పేట, ఇంధన్పల్లి ఎస్ఆర్వోలు సుష్మారావు, కారం శ్రీనివాస్, అటవీ అధికారులు ఆయనను కలిసి అభినందించారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కూడా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ లు ఎఫ్బి వోలు పాల్గొన్నారు.
- Advertisement -