- Advertisement -
‘ఆసియా-పసిఫిక్’ సదస్సుకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
లైఫ్ సైన్స్ రంగంలో ప్రతిష్టాత్మకమైన ‘ఆసియా-పసిఫిక్’ సదస్సులో పాల్గొనెందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్బాబుకు ఆహ్వానం అందింది. దేశంలో ఇప్పటి వరకు ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో జరిగే సదస్సులో పాల్గొనాలని ఆదేశ కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచీ ఆహ్వానించారు. రెండేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, తెలంగాణ సాధించిన ప్రగతిపై మంత్రి కీలకోపన్యాసం చేయనున్నారు.
- Advertisement -